ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : నారాయణఖేడ్ పట్టణంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక ఎస్సై శ్రీశైలం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్సై శ్రీశైలం మాట్లాడుతూ,0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరారు.పోలియో వంటి ప్రమాదకర వ్యాధి నుంచి చిన్నారులను రక్షించడంలో ఈ రెండు చుక్కలు ఎంతో కీలకమైనవని తెలిపారు.తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.ప్రతి ఏడాది సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాసవి క్లబ్ సభ్యులను ఎస్సై శ్రీశైలం అభినందించారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు సాయిబాబు,వాసవి సభ్యులు సాయి సంగమేశ్వర్,కోటగిరి నరసింహులు,కోటగిరి సతీష్, కమ్యూనిస్టు నాయకుడు చిరంజీవి,సీపీఐ నాయకుడు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు