ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా అదనపు కలెక్టర్ (డీఆర్వో) పాండుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్వీ నాయకుడు అఖిల్ మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని కోరారు. విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని, విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల కుదింపు ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రఘు, సాయి తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు