ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు జూన్ 26 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, గంగా-జమునీ తెహజీబ్కు మొహర్రం పర్వదినం ప్రతీకగా నిలుస్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని జీఎంఆర్ యువసేన నాయకులు షకీల్ ఆధ్వర్యంలో శుక్రవారం పటాన్చెరు బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొహర్రం త్యాగం, సహనం, మానవతా విలువలకు ప్రతీక అని పేర్కొన్నారు. పీర్ల రూపంలో అమరవీరులను స్మరించుకునే ఈ పర్వదినం అన్ని మతాల ఐక్యత, సౌభ్రాతృత్వానికి చిహ్నంగా నిలుస్తుందని అన్నారు.పటాన్చెరు నియోజకవర్గంలో కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, నర్రా బిక్షపతి, శ్రీధర్ చారి, పృథ్వీరాజ్, వెంకటేష్, మిరాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు