Monday, 10 August 2026 09:45:14 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

పటాన్‌చెరు రైల్వే భూములు, స్టేషన్‌, ఈఎస్‌ఐ క్లినిక్ స్థలాన్ని పరిశీలించిన ఎంపీ రఘునందన్ రావు

పేదలకు న్యాయం చేయాలని అధికారులను కోరుతాం – స్టేషన్ కబ్జాపై ఆగ్రహం, కార్మికులకు ఉపయోగపడేలా ఈఎస్‌ఐ స్థలాన్ని అభివృద్ధి చేస్తామని హామీ

Date : 02 July 2026 07:56 PM Views : 102

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : :పటాన్‌చెరు నియోజకవర్గంలోని జేపీ కాలనీ డివిజన్ పరిధిలో బండ్లగూడలో ఎంపీ రఘునందన్ రావు గురువారం పర్యటించి రైల్వే భూములు, పటాన్‌చెరు రైల్వే స్టేషన్‌తో పాటు పాత ఈఎస్‌ఐ క్లినిక్ స్థలాన్ని సందర్శించారు.జేపీ కాలనీ డివిజన్ పరిధిలో రైల్వే స్థలంలో ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న పేదల విజ్ఞప్తి మేరకు ఎంపీ బండ్లగూడకు చేరుకుని పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. బండ్లగూడ పరిధిలోని దోసెన్ చెరువు నుంచి పటాన్‌చెరు రైల్వే స్టేషన్ వరకు కాలినడకన పర్యటిస్తూ స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల సమక్షంలోనే రైల్వే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తీసుకుని తనను కలవాలని సూచించారు.ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, పటాన్‌చెరు వరకు ఉన్న రైల్వే వసతిని నిలిపివేసి, రైల్వే ట్రాక్‌తో పాటు సంబంధిత నిర్మాణాలను తొలగించిన తరువాత అక్కడ పేదలు ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. రైల్వే స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడం సరికాదని పేర్కొంటూనే, పేదల సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి వారికి న్యాయం జరిగేలా అధికారులను కోరతామని తెలిపారు. త్వరలోనే రైల్వే అధికారులతో కలిసి మళ్లీ పర్యటించి సమస్య పరిష్కారంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అనంతరం ఎంపీ పటాన్‌చెరు రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఒక ప్రైవేట్ వ్యక్తి రైల్వే ప్రహరీకి గేటు ఏర్పాటు చేసి, రైల్వే స్టేషన్ పరిధిని కబ్జా చేసి బోరు వేయించిన విషయాన్ని గమనించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే రైల్వే అధికారులకు ఫోన్ చేసి, పేదలకు నోటీసులు జారీ చేస్తూ స్టేషన్‌ను కబ్జా చేసిన వారిపై ఎలా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. స్టేషన్‌ను ఆక్రమించిన వారిపై చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.తదుపరి పాత ఈఎస్‌ఐ క్లినిక్ స్థలాన్ని ఎంపీ పరిశీలించారు. ఈ స్థలాన్ని త్వరలోనే కార్మికులకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి కార్మిక శాఖ అధికారులతో కలిసి త్వరలోనే మళ్లీ వచ్చి అవసరమైన చర్యలు ప్రారంభిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :