ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ముత్తంగి డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ముత్తంగి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో రూ.2 కోట్ల 37 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగు నీటి కాలువలు, బోర్వెల్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సౌకర్యాలు, రక్షిత మంచినీటి వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ముత్తంగి డివిజన్ను అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనుల కోసం దశలవారీగా నిధులు కేటాయిస్తూ, నిర్దేశిత గడువులోనే పనులను పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ ప్రభాకర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కుమార్ గౌడ్, ఇంజినీరింగ్ విభాగం డీఈ కృష్ణవేణి, ఏఈ ఫైజాన్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కిట్టు, మేరాజ్ ఖాన్, సందీప్, ఆబీద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు