ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : ఈనెల 10వ తేదీ సోమవారం నాడు ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని బోనాల పండుగ సెలవు కారణంగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు.సోమవారం బోనాల పండగ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి ప్రజావాణి కార్యక్రమం కోసం 10వ తేదీ నాడు ఐడిఓసి కి రాకూడదని అన్నారు. ఆ తర్వాత సోమవారం నుండి యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయడమైనది.
Admin
ప్రజా పిలుపు