ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు, జూన్ 30: బీరంగూడ డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డిపేట్ గ్రామం, దుర్గా నగర్ కాలనీలో ఉన్న భార్గవి అపార్ట్మెంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని విలువైన గృహోపకరణాలు, సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.సమాచారం అందుకున్న వెంటనే బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టంపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్నిప్రమాదం వల్ల నష్టపోయిన కుటుంబం ధైర్యంగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
Admin
ప్రజా పిలుపు