ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఆపద కాలంలో మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బీరంగూడ ఎన్ఎస్ఎల్ కాలనీకి చెందిన పుష్పలత, ప్రగ్య శ్రీ తల్లి కూతుర్లు. ప్రగ్యశ్రీ గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. శస్త్ర చికిత్స తదనంతర ఖర్చుల నిమిత్తం మంజూరైన ఆరు లక్షల 50 వేల రూపాయల విలువైన ఎల్ఓసిని సోమవారం సాయంత్రం వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్ఓసి లతోపాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నమని తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Admin
ప్రజా పిలుపు