ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్ చేరు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, నర బిక్షపతి, కొమరగూడెం వెంకటేష్, వంగరి అశోక్, షకీల్ లడ్డు, రవీంద్ర చారి, కార్ రాజు, మాధురి పృథ్వీరాజ్ తదితరులుపాల్గొన్నారు.అనంతరం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పటాన్చెరు డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలను సందర్శించి కార్యక్రమం నిర్వహణను పరిశీలించారు. జేపీ కాలనీ, గాంధీ థీమ్ పార్క్, గౌతమ్ నగర్, కృషి డిఫెన్స్ కాలనీలలోని పోలియో కేంద్రాలను సందర్శించి ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రజలకు సూచించారు.పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది సేవలను ఈ సందర్భంగా అభినందించారు.
Admin
ప్రజా పిలుపు