ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : వర్గల్ మండలంలోని మజీద్పల్లి గ్రామంలో పలు సీసీ రోడ్లు పూర్తిగా అధ్వానంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి.రోడ్లపై గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, పాదచారులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దెబ్బతిన్న సీసీ రోడ్లకు మరమ్మతులు చేపట్టి, గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Admin
ప్రజా పిలుపు