ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రారం గ్రామ శివారులో ఉన్న పెద్ద చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.మృతుడు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటన స్థలంలో లభించిన వివరాల ప్రకారం, మృతుడు తన దుస్తులను చెరువు కట్టపై వదిలి చెరువులోకి దిగిన అనంతరం మునిగి మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.సమాచారం అందుకున్న పటాన్చెరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడి ఆచూకీ లేదా వివరాలు తెలిసిన వారు, అతని కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఎవరైనా ఉంటే వెంటనే పటాన్చెరు పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Admin
ప్రజా పిలుపు