ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ,సంగారెడ్డి జిల్లా: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ఒక్క చిన్నారిని కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచకుండా ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మేట్టు కుమార్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ సభ్యుడు బాయికాడి విజయకుమార్, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ పృథ్వీరాజ్, పటాన్చెరు ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమురగూడెం వెంకటేష్, లడ్డు బాయ్, కార్మిక నాయకులు నర్ర బిక్షపతి, వంగరి అశోక్, చందు, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు