ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు జూన్ 26 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురంలో నిర్వహించిన మొహర్రం పండుగ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మాట్లాడుతూ.. మొహర్రం త్యాగం, ధర్మం, న్యాయం, మానవతా విలువలకు ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో సోదరభావం, ఐక్యత, పరస్పర గౌరవాన్ని పెంపొందించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తోంట అంజయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పరమేశ్ యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు