ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పరిధిలోని బీహెచ్ఈఎల్ బస్టాప్ సమీపంలో అబ్కారీ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 1.56 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.అధికారుల వివరాల ప్రకారం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఎస్కే రుహిల్ అమిన్, ఎస్కే మోజాయిదుల్ ఇస్లాం అనే ఇద్దరు వ్యక్తులు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.56 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.నిందితులను విచారించిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు అబ్కారీ అధికారులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Admin
ప్రజా పిలుపు