Sunday, 09 August 2026 06:15:08 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

శ్రీ కనకదుర్గ డ్రై క్లీనింగ్ లాండ్రీ షాప్ దగ్ధం.. షార్ట్ సర్క్యూట్‌తో 3 నుంచి 4 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని విష్ణు ఆవేదన!

Date : 03 August 2026 09:48 PM Views : 27

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్‌పూర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీరంగూడ డివిజన్ పరిధిలో ఉన్న జయలక్ష్మీ నగర్ కాలనీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కాలనీలోని రోడ్డు నంబర్ 3 లక్ష్మీనగర్ లో గల ‘శ్రీ కనకదుర్గ డ్రై క్లీనింగ్ & లాండ్రీ’ షాపులో అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి షాప్ అంతా తగల బడింది. ఈ ప్రమాదంలో షాప్ పూర్తిగా దగ్ధమైంది.లాండ్రీ షాప్ ఓనర్ విష్ణు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 7:00 నుండి 7:30 గంటల ప్రాంతంలో ఈ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. షాప్ ముందు ప్రాంతంలో ఉన్న స్థానికులు వెంటనే స్పందించి ఫోన్ చేసి సమాచారం అందించడంతో తాను అక్కడకు చేరుకునేసరికి షాప్‌లోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి.ఈ ప్రమాదంలో సుమారు 70 నుంచి 80 జతల కస్టమర్ల బట్టలు, డ్రై వాష్ మరియు ఐరన్ బట్టలు, ఇనుప మడతలు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయని ఓనర్ విష్ణు తెలిపారు. ఈ సంఘటన ద్వారా తాను 3 నుంచి 4 లక్షల రూపాయలు నష్టపోయినట్టు ఆయన కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని విష్ణు విజ్ఞప్తి చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :