Monday, 10 August 2026 10:52:09 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్త్రీ నిధి సమీక్ష కమిటీ సమావేశం*

Date : 29 July 2026 09:44 PM Views : 30

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో జిల్లా ఫిర్యాదుల పరిష్కార సమావేశ మందిరంలో స్త్రీ నిధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా మేనేజర్ రవికుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్‌డీఓ)తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.సమావేశంలో జిల్లా మేనేజర్ రవికుమార్ జిల్లాలో స్త్రీ నిధి పురోగతిని వివరిస్తూ రుణాల పంపిణీ, రికవరీ, మోసాలు–దుర్వినియోగం కేసులు, స్త్రీ నిధి యాప్ పనితీరు, స్వయం సహాయక సంఘాల ద్వారా నేరుగా స్త్రీ నిధికి చెల్లింపుల విధానం, స్త్రీ నిధి యాప్, పీఓఎస్ యంత్రాలు, బీబీపీఎస్ ద్వారా చెల్లింపుల ప్రక్రియ తదితర అంశాలను వివరించారు.అనంతరం జిల్లా కలెక్టర్ రుణాల పంపిణీ, బకాయిల వసూళ్లలో వెనుకబడిన మండలాల పనితీరును సమీక్షించారు. కావాలనే రుణాలు చెల్లించకుండా బకాయిలు పెండింగ్‌లో ఉంచిన సభ్యులపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే భూ భారతి వ్యవస్థలో భూములను బ్లాక్ చేసే చర్యలు చేపడతామని హెచ్చరించారు.అదేవిధంగా బినామీ రుణాలు, రుణాల దుర్వినియోగం,మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,ఇందులో నిర్లక్ష్యం లేదా తప్పిదం చేసిన సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి స్త్రీ నిధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించడంతో పాటు, తక్కువ పనితీరు ఉన్న మండలాల సిబ్బందితో ప్రతి నెల సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.స్త్రీ నిధి మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాకు ప్యాడీపై వచ్చిన కమిషన్ మొత్తంగా రూ.1.92 కోట్లను స్త్రీ నిధి సంకల్ప డిపాజిట్‌గా జమ చేసినట్లు వెల్లడించారు. ఈ డిపాజిట్‌పై భారతీయ స్టేట్ బ్యాంకు వడ్డీ రేటుతో పోలిస్తే అదనంగా ఒక శాతం వడ్డీ చెల్లించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలోజిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి,అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, సెర్ప్,మెప్మా అధికారులు,జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, మండల సమన్వయకర్తలు,స్త్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్లు, మేనేజర్లు, ప్రాంతీయ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :