ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని ప్రణీత్ నైట్ వుడ్స్ కాలనీలో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ చారి మాట్లాడుతూ, పి.వి. నరసింహారావు తెలుగు జాతికి చెందిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాల వల్ల అనేక అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు భారతదేశానికి వచ్చాయని, తద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించి దేశ అభివృద్ధికి దోహదపడిందని పేర్కొన్నారు. అలాంటి మహనీయుడిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, ఆయన జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.పి.వి. నరసింహారావు ట్రస్ట్కు చెందిన వైద్యుడు మాట్లాడుతూ, ప్రణీత్ గ్రూప్ మరియు నైట్ వుడ్స్ కాలనీ అసోసియేషన్ చేపట్టిన రక్తదాన శిబిరం అభినందనీయమని అన్నారు. రక్తదానం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం లభిస్తుందని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.
Admin
ప్రజా పిలుపు