Monday, 10 August 2026 09:41:29 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

పి.వి. నరసింహారావు జయంతి సందర్భంగా ప్రణీత్ నైట్ వుడ్స్‌లో రక్తదాన శిబిరం

Date : 28 June 2026 02:38 PM Views : 42

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని ప్రణీత్ నైట్ వుడ్స్ కాలనీలో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ చారి మాట్లాడుతూ, పి.వి. నరసింహారావు తెలుగు జాతికి చెందిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాల వల్ల అనేక అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు భారతదేశానికి వచ్చాయని, తద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించి దేశ అభివృద్ధికి దోహదపడిందని పేర్కొన్నారు. అలాంటి మహనీయుడిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, ఆయన జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.పి.వి. నరసింహారావు ట్రస్ట్‌కు చెందిన వైద్యుడు మాట్లాడుతూ, ప్రణీత్ గ్రూప్ మరియు నైట్ వుడ్స్ కాలనీ అసోసియేషన్ చేపట్టిన రక్తదాన శిబిరం అభినందనీయమని అన్నారు. రక్తదానం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం లభిస్తుందని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :