ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు పట్టణంలోని చైతన్య నగర్ కాలనీలో ఉన్న ఎస్సీ శ్మశాన వాటికలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ సొంత నిధులతో నిర్మించిన స్నానాల గదులు, విడిది గృహాన్ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ, చైతన్య నగర్ కాలనీలోని ఎస్సీ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించే కాలనీవాసులకు స్నానాల కోసం సరైన సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా మహిళలు మరింత ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో సొంత నిధులతో స్నానాల గదులు, విడిది గృహం నిర్మించినట్లు తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ సంఘం సభ్యులు మాట్లాడుతూ, శ్మశాన వాటికలో స్నానాల గదులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో మెట్టు కుమార్ యాదవ్ వెంటనే స్పందించి సొంత నిధులతో స్నానాల గదులు, విడిది గృహం నిర్మించడం అభినందనీయమని అన్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సంఘం అధ్యక్షుడు బయగల్ల కృష్ణ, రుద్రారం శంకర్, రాములు, శంకర్, శ్రీరాములు, కొమరగూడెం వెంకటేష్, బలవంత్, భూపాల్, బొద్దుగారి విజయ్, మల్లేష్, బ్యాగరి శ్రీనివాస్, సుకన్య, కర్నె బాలు, బయగల్ల బలరాజ్, ఆల్విన్ కాలనీ అధ్యక్షుడు సత్యనారాయణ, మెట్టు ఎల్లేష్, రవీంద్ర చారి, శాంతి నగర్ కాలనీ అధ్యక్షుడు అంజిరెడ్డి, నిజామాబాద్ శ్రీను, రాజు, గుండమొల్ల రాజు, అజ్మత్ అజ్జూ, మెట్టు కళ్యాణ్ యాదవ్, తిరుపతి రెడ్డి, అఫ్జల్, జయశ్రీ, అజ్మేరి బేగం, చంద్రకళ, అనురాధ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు