Monday, 10 August 2026 10:39:44 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

Date : 08 July 2026 08:37 AM Views : 80

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల (టీయూడబ్ల్యూజే) సంగారెడ్డి జిల్లా మహాసభ పోస్టర్‌ను పటాన్‌చెరులో స్థానిక జర్నలిస్టుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ నెల 9న సంగారెడ్డి పట్టణంలోని టీఎన్‌జీవో భవన్‌లో జరగనున్న జిల్లా మహాసభను విజయవంతం చేయాలని ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు రుమాండ్ల అనిల్‌కుమార్ పిలుపునిచ్చారు.పటాన్‌చెరు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రుమాండ్ల అనిల్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పర్చ శ్రీనాథ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం టీయూడబ్ల్యూజే రాష్ట్రవ్యాప్తంగా కృషి చేస్తోందన్నారు. సంగారెడ్డిలో జరిగే జిల్లా మహాసభలో జిల్లా కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ తొలిసారిగా సంగారెడ్డి జిల్లాకు రానున్న సందర్భంగా ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న పాత్రికేయులు మహాసభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు నర్రా రామారావు, సయ్యద్ సులేమాన్, కాశీపతి, పత్తి నరసింహ, ఏబీఎన్ యాదగిరి, బసవేశ్వర్, బాలు, శ్రీనివాసరెడ్డి, బీసీఎన్ శ్రీనివాస్, మాజీద్ అలీ, మడపటి శేఖర్, వివేక్, కోటేష్, శివాజీ, ప్రభాకర్ యాదవ్, సిద్దు, రాము, సంజీవ, రాజు, సలీం, విజయ్ కుమార్, బండి పురుషోత్తం, శంకర్, దశరత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :