ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు పట్టణానికి చెందిన పెద్ద బోయిన శివమ్మ (82) అనే వృద్ధ మహిళ ఈ నెల 28వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వృద్ధ మహిళ కుమారుడు పెద్ద బోయిన రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పటాన్చెరు పోలీస్ ఇన్స్పెక్టర్ ఎం. రవీందర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్ద బోయిన శివమ్మ ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా పటాన్చెరు పోలీస్ స్టేషన్ను సంప్రదించి సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.
Admin
ప్రజా పిలుపు