Sunday, 09 August 2026 06:13:34 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

అమీన్‌పూర్‌లో చిట్టీల పేరిట రూ.2.5 కోట్ల మోసం

భార్యాభర్తల పరార్‌*..బాధితుల ఆందోళన..పోలీసులకు ఫిర్యాదు*

Date : 03 August 2026 02:07 PM Views : 24

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిట్టీల పేరిట రూ.2.5 కోట్లకు పైగా వసూలు చేసి ఓ దంపతులు రాత్రికి రాత్రే పరారైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సాంబశివరావు, శిరీష దంపతులు అమీన్‌పూర్‌లోని బీఎస్‌ఆర్ కాలనీలో గత 20 ఏళ్లుగా నివాసముంటున్నారు.స్థానికులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్న వీరు, ప్రతి నెలా పెద్ద మొత్తంలో చిట్టీల వసూళ్లు ప్రారంభించారు.ప్రారంభంలో క్రమం తప్పకుండా చెల్లింపులు చేయడంతో కాలనీవాసులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా వీరి వద్ద లక్షలాది రూపాయలు చిట్టీల రూపంలో జమ చేశారు.ఇటీవల చిట్టీల గడువు ముగిసి డబ్బులు చెల్లించాల్సి రావడంతో, రకరకాల కారణాలు చెబుతూ కాలయాపన చేస్తూ వచ్చారు.అనుమానం వచ్చిన స్థానికులు పరిశీలించగా, దంపతులు తమ సొంత ఇంటిని విక్రయించి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఊరు విడిచి పారిపోయినట్లు తెలిసింది. సుమారు 20 మందికి పైగా బాధితుల నుంచి రూ.2.5 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న దంపతుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :