Monday, 10 August 2026 08:55:03 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

సిరిసిల్ల జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం

*41,147 మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించేందుకు 393 బూత్‌లు ఏర్పాటు*

Date : 28 June 2026 02:46 PM Views : 47

ప్రజా పిలుపు / తెలంగాణ / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదివారం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పోలియో వ్యాక్సిన్ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 0 నుంచి 5 ఏళ్లలోపు 41,147 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ అందించేందుకు 393 పోలియో బూత్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా రెండు రోజుల పాటు వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని వెల్లడించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ వ్యాక్సిన్‌ను ప్రతి చిన్నారికి తప్పనిసరిగా వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, డీఎంహెచ్‌ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నాగేంద్ర బాబు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :