ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నిర్వహించనున్న బోనాల పండుగను ప్రజలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని స్టేషన్ హౌస్ అధికారి సుధీర్ కుమార్ కోరారు.బోనాల పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ తరఫున అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. పండుగ నిర్వాహకులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.నిబంధనలకు విరుద్ధంగా ధ్వని పరికరాలను వినియోగించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సుధీర్ కుమార్ కోరారు.
Admin
ప్రజా పిలుపు