Monday, 10 August 2026 10:52:08 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 మంది పదో తరగతి ప్రతిభావంతుల సత్కారం*

*పటాన్చెరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ.1.50 లక్షల నగదు ప్రోత్సాహకం*

Date : 06 July 2026 05:31 PM Views : 73

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరులోని జిల్లా పరిషత్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదివి 500 మార్కులకు పైగా సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహకం అందజేశారు. మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తన సొంత నిధులతో ఒక్కో విద్యార్థికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.1.50 లక్షలు అందజేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి 21 మంది, బాలుర ఉన్నత పాఠశాల నుంచి 9 మంది, మొత్తం 30 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందించారు.ఈ సందర్భంగా గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఎంకేవై ఫౌండేషన్ ద్వారా మెట్టు కుమార్ యాదవ్ విద్యార్థులను ప్రోత్సహిస్తూ చేపడుతున్న సేవా కార్యక్రమం అభినందనీయమన్నారు.ఇలాంటి ప్రోత్సాహకాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగేలా చేస్తాయని చెప్పారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో 550 మార్కులకు పైగా సాధించిన ప్రతి విద్యార్థిని, విద్యార్థిని విమానంలో తిరుపతికి తీసుకెళ్లి శ్రీవారి దర్శనం చేయిస్తామని తెలిపారు.మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ, తాము అందిస్తున్న సహాయం చిన్నదే అయినప్పటికీ అది విద్యార్థులను మరింత కష్టపడి చదివేలా ప్రేరేపిస్తుందని అన్నారు.ప్రతిభావంతులైన విద్యార్థులకు పేదరికం అడ్డు కాకూడదని, ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి విద్యలో రాణించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయ్కాడి విజయకుమార్, బండ్లగూడ డివిజన్ అధ్యక్షుడు భరత్ కుమార్, ఏక్తా–86 అధ్యక్షుడు జయరాం రెడ్డి, ఎంఈవో నాగేశ్వర్ నాయక్, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ రావు, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్పందన చౌదరి, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ఎంకేవై ఫౌండేషన్ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :