ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన ఈ నెల 20వ తేదీ (సోమవారం) ఉమ్మడి జిల్లా స్థాయిలో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో, అదే రోజు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో ఎల్నినో ప్రభావం, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, పంటల సాగు, భూగర్భ జలాల పరిస్థితి, విద్యుత్ సరఫరా, తాగునీటి పంపిణీ, సీజనల్ వ్యాధుల నివారణ–నియంత్రణ చర్యలు తదితర అంశాలపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కారణంగా జూలై 20న ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యం కాదని, తదుపరి సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విజ్ఞప్తి చేశారు.
Admin
ప్రజా పిలుపు