ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, సామాజిక సేవలో ఎల్లప్పుడూ ముందుండే కాశమైన సందీప్ సిద్దిపేట జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్ గా నియామకం అవడం సంతోషకరమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు సందీప్ ను సన్మానించి ఎంపీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల సంరక్షణతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని అందుకు తన వంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బిజెపి నాయకులు రొట్టెల దాసు, శ్రీరామ్ కృష్ణ తదితర నాయకుల పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు