ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిగామ గ్రామ శివారులో విశాఖ రోడ్డుపై ఉన్న మూసివేసిన పెన్నో ప్లాస్ట్ కంపెనీ ప్రహరీ గోడ వెలుపల సోమవారం ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు.మృతుడు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన ముస్లిం వ్యక్తిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతుడివద్దఎలాంటిగుర్తింపుపత్రాలులభించకపోవడంతో అతని వివరాలు తెలియరాలేదు.భానూర్ సీఐ విజయకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, మూసివేసిన కంపెనీ ప్రాంగణంలోకి దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ప్రహరీ గోడ ఎక్కి లోపలికి ప్రవేశించే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి గోడ వెలుపల ఉన్న పొదల్లో పడిపోయి మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో అనుమానం వ్యక్తమవుతోంది.ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని,పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణం స్పష్టమవుతుందని తెలిపారు.మృతుడి గుర్తింపునకు పోలీసులు చర్యలు చేపట్టారు.అతని వివరాలు తెలిసిన వారు లేదాఎవరైనా గుర్తిస్తే వెంటనే భానూర్ బీడీఎల్ పోలీస్ స్టేషన్కు 8712661840, 8712656727 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
Admin
ప్రజా పిలుపు