Monday, 10 August 2026 07:55:56 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

మూసివేసిన కంపెనీ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

దొంగతనం చేసేందుకు వచ్చి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ప్రాథమిక అనుమానం:భానూర్ పోలీసులు

Date : 20 July 2026 01:35 PM Views : 235

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిగామ గ్రామ శివారులో విశాఖ రోడ్డుపై ఉన్న మూసివేసిన పెన్నో ప్లాస్ట్ కంపెనీ ప్రహరీ గోడ వెలుపల సోమవారం ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు.మృతుడు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన ముస్లిం వ్యక్తిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతుడివద్దఎలాంటిగుర్తింపుపత్రాలులభించకపోవడంతో అతని వివరాలు తెలియరాలేదు.భానూర్ సీఐ విజయకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, మూసివేసిన కంపెనీ ప్రాంగణంలోకి దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ప్రహరీ గోడ ఎక్కి లోపలికి ప్రవేశించే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి గోడ వెలుపల ఉన్న పొదల్లో పడిపోయి మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో అనుమానం వ్యక్తమవుతోంది.ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని,పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణం స్పష్టమవుతుందని తెలిపారు.మృతుడి గుర్తింపునకు పోలీసులు చర్యలు చేపట్టారు.అతని వివరాలు తెలిసిన వారు లేదాఎవరైనా గుర్తిస్తే వెంటనే భానూర్ బీడీఎల్ పోలీస్ స్టేషన్‌కు 8712661840, 8712656727 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :