ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిల్లా:జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం ఈ రోజు బాల సదన్ నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి బి. సౌజన్య గారు తనికి నిర్వహించటం జరిగినది.ఈ తనికి లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి బి. సౌజన్య మాట్లాడుతూ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి సంరక్షణను తోడ్పడాలని అన్నారు. అందరు క్రమశిక్షణగా ఉండాలి అన్నారు. అదేవిదంగా వారి యొక్క బాగోగులను కూడా చూడాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి అని తేలిపారు.వర్షాకాలం దృష్ట్యా విద్యార్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి అన్నారు, విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు.చట్టాలపై అవగాహన పెంచుకోవాలి అని అన్నారు. ఎవరికైనా న్యాయ పరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఏదైనా న్యాయ సహాయం కోరినచో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం, సంగారెడ్డిని సంప్రదించగలరు.
Admin
ప్రజా పిలుపు