ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : కోహీర్ మండల నూతన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా ఉమాదేవి బాధ్యతలు స్వీకరించారు.ఇంతకుముందు నర్సాపూర్ మండలంలో ఎంపీడీఓగా విధులు నిర్వహించిన ఆమె బదిలీపై కోహీర్కు వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ నర్సాపూర్కు బదిలీ అయ్యారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఎంపీడీఓ ఉమాదేవికి ఘన స్వాగతం పలికారు.ఎంపీవో వెంకట్రెడ్డి పూలమాలతో అభినందించగా, కార్యాలయ సూపరింటెండెంట్ అంజయ్య శాలువాతో సన్మానించారు.అనంతరం వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ ఉమాదేవి మాట్లాడుతూ, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన పరిపాలనా సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ, అధికారులు, సిబ్బందితో సమన్వయంగా పనిచేసి మండల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Admin
ప్రజా పిలుపు