ప్రజా పిలుపు / తెలంగాణ / హైదరాబాదు : శేరిలింగంపల్లి నియోజకవర్గం భారతీనగర్ డివిజన్ బీహెచ్ఈఎల్ ఎంఐజీ కాలనీలోని శ్రీ రామాలయంలో నిర్వహించిన మూడో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి ఆదర్శ్ రెడ్డి, భారతీనగర్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలునిర్వహించారు.ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులకు పూర్ణకుంభ స్వాగతం పలికి వేదమంత్రాల నడుమ ఆశీర్వచనాలు అందించారు. అనంతరం శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సోదరభావం, భక్తిని పెంపొందిస్తాయని అన్నారు. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందిస్తూ, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొందాలనికోరారు.కార్యక్రమంలో మియాపూర్ మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్, రఘునాథ్ రెడ్డి, కాలనీ నిర్వాహకులు నారాయణ గౌడ్, నీలకంఠం, ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, జనార్ధన్, నారాయణ, రామ్ ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు