Sunday, 09 August 2026 06:14:46 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

ఆగస్టు 10 వరకు ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు అవకాశం*

*ప్రతి అర్హత గల ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండాలి* జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్*

Date : 01 August 2026 04:17 PM Views : 28

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువును భారత ఎన్నికల సంఘం ఆగస్టు 10, 2026 వరకు పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసిందని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా తమ ఫారాలను సమర్పించాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 78 శాతం పూర్తయిందని తెలిపారు. ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆగస్టు 10 లోపు తమ ఫారాలను సంబంధిత బీఎల్‌వోలకు తప్పనిసరిగా సమర్పించాలని కోరారు.అలాగే పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా ఆగస్టు 10 నాటికి పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17, 2026న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించబడుతుందని, అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు ఓటర్లు క్లెయిమ్స్, అభ్యంతరాలను సమర్పించవచ్చని తెలిపారు.స్వీకరించిన క్లెయిమ్స్, అభ్యంతరాలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పరిశీలించి ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు పరిష్కార ప్రక్రియ చేపట్టనున్నట్లు, అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రచురించబడుతుందని వెల్లడించారు.జిల్లాలో ప్రతి అర్హుడైన ఓటరు పేరు తప్పనిసరిగా ఓటరు జాబితాలో ఉండాలన్నారు.బీఎల్‌వోలు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, సూపర్‌వైజర్లు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులోపు అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :