Sunday, 09 August 2026 08:13:32 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

రూ.2.50 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి*

నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ*

Date : 17 July 2026 07:56 PM Views : 144

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఆర్థిక ఇబ్బందులతో మెరుగైన వైద్యం పొందలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) వరంగా మారిందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.అమీన్పూర్ డివిజన్‌కు చెందిన కూరపాటి రేణుక అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సిఫారసుతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు.దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వం రూ.2.50 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసి)ను మంజూరు చేసింది. మంజూరైన ఎల్ఓసిని శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యవసర వైద్య అవసరాల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్ఓసిలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పూర్తిస్థాయి పారదర్శకతతో లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు.తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలు తమ కార్యాలయాన్ని సంప్రదించి సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సహాయం అందేలా తన వంతు కృషి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :