Monday, 10 August 2026 08:55:12 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

బీరంగూడ డివిజన్‌లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు*

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కాట సుధారాణి, శశిధర్ రెడ్డి*

Date : 29 July 2026 09:41 PM Views : 33

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్‌పూర్ పవిత్ర గురుపౌర్ణమి సందర్భంగా అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ డివిజన్‌లోని సాయి కాలనీ,ఎన్ఆర్ఐ కాలనీ,గోశాలలో ఉన్న సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.వేడుకల్లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధారాణి, అమీన్‌పూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, ఆలయ నిర్వాహకులు వారికి స్వాగతం పలికారు.అనంతరం ఆలయంలో వేదమంత్రాల నడుమ అభిషేకం, ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని సాయిబాబాను ప్రార్థించారు. పూజల అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ డైరెక్టర్లు రమేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, కుమ్మరి మహేష్, చంద్రశేఖర్, జన్ముల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సురేష్ నాయక్, బిక్షపతి, కృష్ణ, రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మనోహర్, మస్తాన్ నాయుడు,రాము,మల్లారావు,ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :