Sunday, 09 August 2026 10:46:07 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

*బీరంగూడ గుట్టలో వైభవంగా వరుణ యాగం*

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు

Date : 24 July 2026 04:15 PM Views : 86

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖశాంతులు, సుభిక్షంతో జీవించాలని ఆకాంక్షిస్తూ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం వరుణ జపం, వరుణ హోమం, వరుణ యాగం, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు.ఆలయ కార్యనిర్వహణాధికారి దేవనాదం, ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన అర్చకులు ప్రహ్లాద్‌తో పాటు వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.యాగంలో భాగంగా 108 పవిత్ర కలశాలను ప్రతిష్ఠించి వరుణ జపం, వరుణ హోమం, రుద్రాభిషేకాలు, కలశాభిషేకాలు నిర్వహించారు.అనంతరం పూర్ణాహుతి నిర్వహించి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఈఓ దేవనాదం మాట్లాడుతూ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా బీరంగూడ గుట్ట దేవాలయంలో వరుణ యాగం నిర్వహించినట్లు తెలిపారు. ప్రకృతి సమతుల్యత నెలకొని రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని సంకల్పించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, చారిత్రాత్మక బీరంగూడ గుట్ట పుణ్యక్షేత్రంలో స్వామివారి అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు ఆనందంగా జీవించాలని, ప్రజలందరికీ శాంతి, ఐశ్వర్యాలు కలగాలని సంకల్పించి వరుణ యాగం నిర్వహించినట్లు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తుడిపై స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :