ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు పట్టణంలో హరే రామ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు, ఎండీఆర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన రథయాత్రలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బంగారు చీపురుతో రథమార్గాన్ని శుభ్రపరిచి, అనంతరం రథాన్ని లాగి యాత్రను ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ జగన్నాథ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, పూరి శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ప్రపంచంలోని అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటిగా విశిష్ట స్థానాన్ని కలిగి ఉందన్నారు. పటాన్చెరులో ఇటువంటి ఆధ్యాత్మిక వేడుకను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరూ శ్రీ జగన్నాథ స్వామివారి ఆశీస్సులతో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన్ దేవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, రథదాత జలగరి ఎట్టయ్య,విజయ్ కుమార్, యాదగిరి యాదవ్, నర్ర బిక్షపతి, వంగారి అశోక్, ఉత్సవ కమిటీ సభ్యులు, ఎంపీఆర్ యువసేన సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు