Monday, 10 August 2026 10:39:46 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

పటాన్‌చెరులో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర

Date : 18 July 2026 10:19 PM Views : 38

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పట్టణంలో హరే రామ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు, ఎండీఆర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన రథయాత్రలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బంగారు చీపురుతో రథమార్గాన్ని శుభ్రపరిచి, అనంతరం రథాన్ని లాగి యాత్రను ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ జగన్నాథ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, పూరి శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ప్రపంచంలోని అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటిగా విశిష్ట స్థానాన్ని కలిగి ఉందన్నారు. పటాన్‌చెరులో ఇటువంటి ఆధ్యాత్మిక వేడుకను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలందరూ శ్రీ జగన్నాథ స్వామివారి ఆశీస్సులతో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన్ దేవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, రథదాత జలగరి ఎట్టయ్య,విజయ్ కుమార్, యాదగిరి యాదవ్, నర్ర బిక్షపతి, వంగారి అశోక్, ఉత్సవ కమిటీ సభ్యులు, ఎంపీఆర్ యువసేన సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :