ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు జూన్ 27 శనివారం: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఒకటి, రెండు వార్డుల్లో శనివారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల శాఖ అధికారులు, బూత్ స్థాయి సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించారు. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు, కుటుంబ వివరాలు, ఇతర సమాచారాన్ని ధృవీకరించి అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం వివరాలను నమోదు చేశారు.18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు తమ వివరాలను ఒకసారి పరిశీలించి తప్పులు ఉంటే వెంటనే సరిచేయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో తప్పులులేకుండా రూపొందించడమే లక్ష్యమని తెలిపారు.ప్రజలు తమకు సంబంధించిన ఆధార పత్రాలను సిద్ధంగా ఉంచి అధికారులకు సహకరించాలని, ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వార్డుల వారీగా ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు బి ఆర్ ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమురగూడెం వెంకటేష్ బి ఎల్ వో లు తదితరులు,పాల్గొన్నారు
Admin
ప్రజా పిలుపు