ప్రజా పిలుపు / తెలంగాణ / హైదరాబాదు : * హైదరాబాద్, ఆగస్టు 8: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వరుణ యాగం నిర్వహించాలని నిర్ణయించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితులు, సిద్ధాంతులు నిర్ణయించిన ముహూర్తం మేరకు ఈ నెల 10న నాగార్జునసాగర్లో వరుణ యాగం నిర్వహించనున్నారు.నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో యాగ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేదపండితులు నిర్ణయించిన ముహూర్తంలో యాగ క్రతువులను నిర్వహించనున్నారు.రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు, చెరువులు నిండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని సంకల్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సారథ్యంలో వరుణ యాగం జరగనుంది. యాగం అనంతరం నిర్వహించే మహా పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్నారు.
Admin
ప్రజా పిలుపు