ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గాభవానీ మాత ఆలయంలో అమ్మవారికి విశేష అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు సర్వాంగ సుందరంగా అలంకరించబడి భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు.ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారగా, అమ్మవారి అలంకరణ అందరినీ ఆకట్టుకుంది. ప్రత్యేక అలంకరణతో వెలసిన అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Admin
ప్రజా పిలుపు