Monday, 10 August 2026 08:55:59 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

*ఏడుపాయల్లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జల ప్రసాదం కేంద్రం నిరుపయోగం*

Date : 31 July 2026 03:26 PM Views : 37

ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ మాత ఆలయానికి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ముఖ్యంగా పండుగలు, సెలవు రోజుల్లో భక్తుల రద్దీ మరింత అధికంగా ఉంటుంది.భక్తుల దాహార్తి తీర్చేందుకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో జల ప్రసాదం పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆ కేంద్రం వినియోగంలో లేకపోవడంతో భక్తులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వర్షాకాలం, ఎండాకాలం అనే తేడా లేకుండా ఏడాది పొడవునా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుండటంతో జల ప్రసాదం కేంద్రాన్ని తిరిగి ప్రారంభించి, స్వచ్ఛమైన తాగునీటిని నిరంతరం అందుబాటులో ఉంచేలా సంబంధిత అధికారులు, అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :