Monday, 10 August 2026 10:39:45 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

ఎస్ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండండి ప్రతి ఓటు అత్యంత కీలకం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Date : 06 July 2026 12:54 PM Views : 57

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. సరైన సమాచారం లేకపోవడంతో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.సోమవారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ తరఫున నియమితులైన బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి ప్రతి అర్హ ఓటరిని ఎస్ఐఆర్‌లో నమోదు చేయించేలా కృషి చేయాలని సూచించారు. పటాన్చెరు “మినీ ఇండియా”గా పేరుగాంచిన నియోజకవర్గమని, ఇక్కడ వివిధ రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ నెల 12న పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా ఎస్ఐఆర్, బీఆర్ఎస్ డిజిటల్ మెంబర్షిప్‌పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :