ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : గజ్వేల్ హాస్టల్ నుంచి పారిపోవాలని చూసిన విద్యార్థిని జగదేవ్పూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి కు అప్పగించిన సీఐ రవికుమార్ ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గుండన్నపల్లి సమీపంలో తెలంగాణ మైనారిటీ పాఠశాలలో చదువుతున్న గుగులోత్ రితిక ( 13) 7వ తరగతి చదువుతున్నది హాస్టల్లో ఉండడం ఇష్టం లేక శుక్రవారం రాత్రి ఒకటి గంటలకు ఎవరికి చెప్పకుండా పాఠశాల నుంచి బయటకు వచ్చి రోడ్డుపై కనిపించింది. గజ్వేల్ సిఐ సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా ఈ విషయాన్ని వెంటనే ఆమె తల్లిదండ్రులను ఫోన్లో సంప్రదించి జగదేవ్పూర్ ఎస్ఐ కృష్ణారెడ్డీ విద్యార్థిని సురక్షింతంగా అప్పగించారు.
Admin
ప్రజా పిలుపు