ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రుద్రారం గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఉప్పులగడ్డ తండాలో నివాసముంటున్న ఆయన తన భార్య సమీనాతో కలిసి ఆటోలో ఇస్నాపూర్ మార్కెట్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఆగస్టు 7న మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో రుద్రారం గ్రామం సమీపంలోని బ్రిడ్జి వద్దకు ఆటో చేరుకోగానే, ఆటోలో వెనుక సీటులో కూర్చున్న సమీనా తలకు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగినట్లు పేర్కొన్నారు.ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. ఘటనపై బాధితురాలి భర్త పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదుపై. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Admin
ప్రజా పిలుపు