Sunday, 09 August 2026 09:10:31 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

5.5 కిలోల గంజాయి, మొబైల్ ఫోన్లు స్వాధీనం

నిందితులంతా బీహార్‌కు చెందినవారే.. ఒకరు పరారీ

Date : 10 July 2026 08:59 PM Views : 64

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : కొల్లూరు నిర్మాణ రంగానికి చెందిన లేబర్ క్యాంపులో కార్మికులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు అంతర్రాష్ట్ర పెడ్లర్లను కొల్లూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. వేల విలువైన 5.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'మై హోమ్ సయుక్' నిర్మాణ సంస్థకు చెందిన లేబర్ క్యాంపులో కొందరు వ్యక్తులు కార్మికులకు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై నిఘా ఉంచిన పోలీసులు శుక్రవారం దాడి చేసి ఐదుగురు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.అరెస్ట్ అయిన వారిలో బీహార్ రాష్ట్రం, దర్భంగా జిల్లాకు చెందిన ఎం.డి. కైఫ్ (20), ఎం.డి. సైఫ్ (21) (ఇద్దరూ అన్నదమ్ములు), ఎం.డి. తుఫైల్ (21), ఎం.డి. కలీమ్ (28) ఉన్నారు. వీరంతా తెల్లాపూర్‌లోని మై హోమ్ లేబర్ క్యాంపులో ఉంటూ పెయింటింగ్, కూలీ పనులు చేస్తున్నారు. వీరు తమ సొంత రాష్ట్రం బీహార్ నుండి గంజాయిని తీసుకువచ్చి ఇక్కడి కార్మికులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.ఈ కేసులో A-2 నుంచి A-5 వరకు ఉన్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, అసదుల్లా అలియాస్ అబ్దుల్లా అనే మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇతడు బీహార్‌లోని దర్భంగా జిల్లా, కట్టా గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు.పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు కొల్లూర్ పోలీసులు తెలిపారు. కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :