ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : కొల్లూరు నిర్మాణ రంగానికి చెందిన లేబర్ క్యాంపులో కార్మికులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు అంతర్రాష్ట్ర పెడ్లర్లను కొల్లూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. వేల విలువైన 5.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'మై హోమ్ సయుక్' నిర్మాణ సంస్థకు చెందిన లేబర్ క్యాంపులో కొందరు వ్యక్తులు కార్మికులకు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై నిఘా ఉంచిన పోలీసులు శుక్రవారం దాడి చేసి ఐదుగురు నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.అరెస్ట్ అయిన వారిలో బీహార్ రాష్ట్రం, దర్భంగా జిల్లాకు చెందిన ఎం.డి. కైఫ్ (20), ఎం.డి. సైఫ్ (21) (ఇద్దరూ అన్నదమ్ములు), ఎం.డి. తుఫైల్ (21), ఎం.డి. కలీమ్ (28) ఉన్నారు. వీరంతా తెల్లాపూర్లోని మై హోమ్ లేబర్ క్యాంపులో ఉంటూ పెయింటింగ్, కూలీ పనులు చేస్తున్నారు. వీరు తమ సొంత రాష్ట్రం బీహార్ నుండి గంజాయిని తీసుకువచ్చి ఇక్కడి కార్మికులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.ఈ కేసులో A-2 నుంచి A-5 వరకు ఉన్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, అసదుల్లా అలియాస్ అబ్దుల్లా అనే మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇతడు బీహార్లోని దర్భంగా జిల్లా, కట్టా గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు.పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు కొల్లూర్ పోలీసులు తెలిపారు. కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Admin
ప్రజా పిలుపు